నేడే ఢిల్లీలో వైఎస్సార్‌సీపీ మహాధర్నా | Sakshi
Sakshi News home page

నేడే ఢిల్లీలో వైఎస్సార్‌సీపీ మహాధర్నా

Published Mon, Mar 5 2018 8:19 AM

ఐదుకోట్ల ఆంధ్రులకు అపర సంజీవని వంటి ప్రత్యేక హోదాను సాధించడం కోసం జరుగుతున్న పోరాటం దేశ రాజధాని న్యూఢిల్లీకి చేరుకుంది. ‘‘ప్యాకేజీతో మోసం చేయొద్దు.. ప్రత్యేక హోదా మన హక్కు’’ అన్న నినాదంతో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నియోజకవర్గాల సమన్వయకర్తలు, ముఖ్యనేతలంతా ఢిల్లీకి చేరుకున్నారు.