తిహార్ జైలులో చిదంబరంను కలిసిన సోనియా | Sonia Gandhi, Manmohan Singh meet Chidambaram in jail | Sakshi
Sakshi News home page

తిహార్ జైలులో చిదంబరంను కలిసిన సోనియా

Sep 24 2019 8:24 AM | Updated on Sep 24 2019 8:44 AM

ఐఎన్‌ఎక్స్‌ మీడియా కేసులో తీహార్‌ జైల్లో ఉన్న కేంద్ర మాజీ మంత్రి చిదంబరంను కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియాగాంధీ, మాజీ ప్రధాని మన్మోహన్‌ సోమవారం కలిశారు. తీహార్‌ జైలుకు వెళ్లిన సోనియా, మన్మోహన్‌లు సుమారు అరగంట సేపు ఆయనతో మాట్లాడారు. చిదంబరం ఆరోగ్యం గురించి వాకబు చేసిన ఇద్దరు నేతలు ఆయనపై మోపిన కేసులను రాజకీయంగా దీటుగా ఎదుర్కొంటామని, పార్టీ మద్దతుగా నిలుస్తుందని హామీ ఇచ్చినట్లు కాంగ్రెస్‌ వర్గాలు తెలిపాయి.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement