ముగిసిన జగన్నాథుని రథయాత్ర

ఒడిశాలోని పూరీలో జగన్నాథుని బహుడా యాత్ర (రథయాత్ర) ఆదివారం ఘనంగా ముగిసింది. శ్రీ గుండిచా మందిరంలో 9 రోజుల కొలువు ముగించుకుని దేవతలు జగన్నాథుడు, ఆయన అన్న బలభద్రుడు, వారి సోదరి సుభద్ర బ్రహ్మాండంగా అలంకరించిన మూడు చెక్క రథాలపై తిరిగి శ్రీ మందిరం (జగన్నాథుని ఆలయం) సింహ ద్వారం ఆవరణకు చేరడంతో బహుడా యాత్ర సమాప్తమైంది. మరో 3 రోజులపాటు శ్రీ మందిరం సింహద్వారం వద్దే రథాలపై దేవుళ్లు కొలువుదీరుతారు. స్వర్ణాలంకారం, అధర పొణా ఉత్సవాల్ని ముగించి నీలాద్రి విజే ఉత్సవంలో మూల విరాట్లను ప్రధాన వేదికకు తరలిస్తారు.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వీడియోలు



 

Read also in:
Back to Top