వేధింపులు తట్టుకోలేక ఆత్మహత్యాయత్నం
పట్టణంలోని హౌసింగ్ బోర్డు కాలనీలో గల శ్రీవేంకటేశ్వరస్వామివారి ఆలయంలో పనిచేసే అర్చకుడు ఆలయ నిర్వాహకుల వేధింపులు తాళలేక ఆత్మహత్యాయత్నం చేసుకున్న సంఘటన బుధవారం చోటు చేసుకుంది. విశాఖపట్నం జిల్లా మాడుగుల మండల ఎం కోటపాడు గ్రామానికి చెందిన పాణింగపల్లి çఫణికుమారాచార్యులు ఏడాది కాలంగా ఆలయంలో అర్చకత్వం చేస్తున్నారు. ఈ ఆలయం ప్రైవేటు వ్యక్తుల యాజమాన్యంలో నడుస్తోంది. ఆలయ నిర్వాహకులు కొంత కాలంగా తనను వేధిస్తున్నారని, వేధింపులు తట్టుకోలేక తాను ఆత్మహత్యాయత్నం చేసుకుంటున్నాని పేర్కొంటూ వాట్సాప్లో వీడియో మెసేజ్ పెట్టి ఎలుకల మందు సేవించాడు.
మరిన్ని వీడియోలు
సినిమా
వార్తలు
సీఎం వైఎస్ జగన్
బిజినెస్
క్రీడలు
వైరల్ వీడియోలు