నిండు ప్రాణాన్ని బలి తీసుకున్న ఎన్నికల ప్రచారం
మండలంలోని టి. వెలమవారిపల్లె గ్రామంలో టీడీపీ నాయకులు ఎన్నికల ప్రచారంలో టపాసులు పేల్చి ఒక వ్యక్తి మృతికి కారకులయ్యారని గ్రామస్తులు తెలిపారు. ఈ ఘటన బుధవారం సాయంత్రం చోటు చేసు కుంది. వివరాలిలా.. టి. వెలమవారిపల్లెలో వెఎస్సార్సీపీ నాయకుడు కందుల వెంకట రామిరెడ్డి ఇంటి ఎదుట మాజీ ఎమ్మెల్సీ సతీష్కుమార్రెడ్డి సోదరుడు విష్ణువర్దనరెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వస్తుండగా ఇంటి వద్ద టపాసులు పేల్చవద్దని చెబుతున్నా వినకుండా వారు పెద్ద ఎత్తన పేల్చారు. దీంతో ఆరోగ్యం బాగాలేని వెంకటరామిరెడ్డి ఆ శబ్దానికి గుండె పోటు వచ్చి మృతి చెందాడు.
మరిన్ని వీడియోలు
సినిమా
వార్తలు
సీఎం వైఎస్ జగన్
బిజినెస్
క్రీడలు
వైరల్ వీడియోలు