ఉగ్రవాద నిర్మూలన విషయంలో పాకిస్తాన్ను అమెరికా మరోసారి ఘాటుగా హెచ్చరించింది. ‘ముష్కర ముఠాలపై మీరు చర్యలు తీసుకోకుంటే మేమే నేరుగా దాడులు చేస్తామని’ ఉపాధ్యక్షుడు మైక్ పేన్స్.. పాక్ ప్రధాని అబ్బాసీతో అన్నారు. అమెరికా పర్యటనకు వచ్చిన పాక్ ప్రధాని శుక్రవారం ట్రంప్ డిప్యూటీని కలుసుకున్నారు.