వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్రెడ్డి పార్టీ వీడుతున్నాడంటూ వస్తున్న వార్తల్ని ఆయన ఖండించారు. వైస్సార్సీపీని వీడుతున్నానంటూ కొన్ని మీడియా సంస్థలు దుష్ప్రచారం చేస్తున్నాయని మండిపడ్డారు. గురువారం ఆయన ఢిల్లీలో మాట్లాడారు. నైతిక విలువలతో వార్తలు రాయాలి గాని తప్పుడు వార్తలు ప్రసారం చేస్తే ఆ చానెళ్లకు విలువలు ఉండవని హెచ్చరించారు. వచ్చే ఎన్నికల్లో మళ్లీ పోటీచేస్తానని స్పష్టం చేశారు. వైఎస్సార్సీపీ ఆవిర్భావానికి ముందు నుంచి వైఎస్ జగన్తో కలిసి పనిచేస్తున్నానని చెప్పారు.
జనాన్ని మభ్యపెట్టడంలో చంద్రబాబు దిట్ట
Jan 31 2019 2:04 PM | Updated on Mar 22 2024 11:23 AM
Advertisement
Advertisement
పోల్
Advertisement