ఆంధ్రప్రదేశ్లో భారీగా ఐఏఎస్ అధికారుల బదిలీ జరిగింది. పెద్ద సంఖ్యలో ఐఏఎస్ అధికారులకు ఏప్రీ ప్రభుత్వం స్థాన చలనం కలిగించింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీచేసింది. కృష్ణా, కడప, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలు మినహా మిగతా తొమ్మిది జిల్లాల కలెక్టర్లను బదిలీ చేసింది.