లోక్సభ ఎన్నికల్లో నిజామాబాద్ నుంచి పోటీచేసి అనూహ్యంగా ఓటమి చెందిన కల్వకుంట్ల కవిత తొలిసారి స్పందించారు. రాజకీయాల్లో గెలుపోటములు సాధారణమని అభిప్రాయపడ్డారు. నిజామాబాద్ స్థానాన్ని వదిలే ప్రసక్తే లేదని, కార్యకర్తలు అధైర్యపడొద్దన్నారు. తెలంగాణ అభివృద్ధి కొరకు పాటుపడతానని ఆమె స్పష్టం చేశారు. జిల్లాలోని మోపాల్ మండలం మంచిప్పలో టీఆర్ఎస్ కార్యకర్త కిషోర్ కుమార్ ఇటీవల మృతి చెందిన విషయం తెలిసిందే. ఆయన కుటుంబాన్ని సోమవారం మాజీ ఎంపీ కవిత పరామర్శించారు. కుటుంబానికి తాము అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.
కార్యకర్త కిషోర్ కుటుంబాన్ని పరామర్శించిన కవిత
May 27 2019 4:12 PM | Updated on Mar 21 2024 8:18 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement