చిన్నారి దీప్తిశ్రీ కిడ్నాప్‌ కేసు ఛేదిస్తాం.. | Kakinada DSP Press Meet On Diptisri Kidnapping Case | Sakshi
Sakshi News home page

చిన్నారి దీప్తిశ్రీ కిడ్నాప్‌ కేసు ఛేదిస్తాం..

Nov 24 2019 8:50 PM | Updated on Nov 24 2019 8:54 PM

చిన్నారి దీప్తిశ్రీ కిడ్నాప్‌ కేసును ఛేదిస్తామని, మరో  రెండు, మూడు రోజులు సమయం పట్టోచ్చని కాకినాడ డిఎస్పీ కరణం కుమార్ తెలిపారు. ఆదివారం మీడియాతో మాట్లాడుతూ.. సవతి తల్లే చంపేసిందన్నది కేవలం వదంతి మాత్రమేనని, ఆ కోణంలోను విచారణ చేస్తూ గాలింపు చర్యలు చేపడుతున్నామని పేర్కొన్నారు. మూడు బృందాలు ఈ కేసును అన్ని కోణాల్లో విచారణ చేపడుతున్నాయని వెల్లడించారు. కుటుంబ వివాదాల నేపథ్యంలో కిడ్నాప్ జరిగిందని భావిస్తున్నామని చెప్పారు. శుక్రవారం మధ్యాహ్నం 1:30 నిమిషాలకు  పాఠశాల నుండి చిన్నారి అపహరణకు గురయిందన్నారు. కొన్ని చోట్ల సిసి కెమెరాలు సరిగా పని చేయకపోవడం వల్ల దర్యాప్తుకు ఆటంకం కలుగుతోందని డిఎస్పీ తెలిపారు.

Related Videos By Category

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement