ఎగ్జిట్‌పోల్స్‌: హుజూర్‌నగర్‌లో టీఆర్‌ఎస్‌దే హవా | Huzurnagar Bye Election: Aaraa Survey Predicts TRS Victory | Sakshi
Sakshi News home page

ఎగ్జిట్‌పోల్స్‌: హుజూర్‌నగర్‌లో టీఆర్‌ఎస్‌దే హవా

Oct 21 2019 8:12 PM | Updated on Mar 21 2024 8:31 PM

హుజూర్‌నగర్‌ ఉప ఎన్నిక పోలింగ్‌ ప్రశాంతంగా ముగిసింది. ఉదయం 7 గంటలకు మొదలైన పోలింగ్‌ సాయంత్రం 5 గంటల వరకు కొనసాగింది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండాపోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. ఇప్పటివరకు 80 శాతానికి పైగా పోలింగ్‌ నమోదైనట్టు సమాచారం. పోలింగ్‌ అనంతరం విడుదైన ఎగ్జిట్‌ పోల్స్‌ టీఆర్‌ఎస్‌ వైపే మొగ్గు చూపుతున్నాయి. హుజూర్‌నగర్‌లో టీఆర్‌ఎస్‌దే విజయమని ఆరా సర్వే సంస్థ ప్రకటించింది. టీఆర్‌ఎస్‌కు 50.48 శాతం, కాంగ్రెస్‌కు 39.95శాతం, ఇతరులకు 9.57శాతం విజయవకాశాలు ఉన్నాయని ఆ సంస్థ పేర్కొంది. హుజూర్‌నగర్‌లోని అన్ని మండలాల్లో టీఆర్‌ఎస్‌కే ఆధిక్యమని తమ సర్వేలో తేలినట్టు ఆరా తెలిపింది.

Related Videos By Category

Advertisement
 
Advertisement

పోల్

Advertisement