ఇక పరిహారం ఇచ్చాకే భూసేకరణ | high court warns Telangana and Andhra pradesh in land pooling | Sakshi
Sakshi News home page

ఇక పరిహారం ఇచ్చాకే భూసేకరణ

Dec 27 2017 8:20 AM | Updated on Mar 21 2024 8:47 PM

వివిధ ప్రాజెక్టులు, అవసరాల కోసం భూసేకరణ చేస్తున్న ప్రభుత్వాలు.. పరిహారం చెల్లింపులో తీవ్ర జాప్యం చేస్తుండటంపై హైకోర్టు మండిపడింది. బాధితులు కోర్టులను ఆశ్రయించి పొందుతున్న పరిహారం పెంపు ఉత్తర్వులను అమలు చేయకపోవడాన్ని తీవ్రంగా ఆక్షేపించింది. ఇలాగైతే పరిహారం చెల్లించాకే భూ సేకరణ జరిపేలా ఆదేశాలిస్తామని హెచ్చరించింది. కోర్టుల ఉత్తర్వులంటే ప్రభుత్వాలకు జోక్‌ అయిపోయిందని ఘాటుగా వ్యాఖ్యానించింది. దేవాదాయ భూములను స్వాధీనం చేసుకోవాలంటే తొలుత పరిహారాన్ని డిపాజిట్‌ చేయాలంటూ ఇచ్చిన ఉత్తర్వుల తరహాలో... అన్ని రకాల భూ సేకరణకు కూడా ఉత్తర్వులు ఇస్తామని స్పష్టం చేసింది.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement