ఫుల్‌గా తాగేసి.. కరెంట్‌ పోల్‌ ఎక్కేశాడు! | Drunken Man Hulchul In Secunderabad | Sakshi
Sakshi News home page

ఫుల్‌గా తాగేసి.. కరెంట్‌ పోల్‌ ఎక్కేశాడు!

Feb 23 2020 3:16 PM | Updated on Mar 21 2024 8:24 PM

సాక్షి,హైదరాబాద్‌: సికింద్రాబాద్‌లో మందుబాబు హల్‌చల్‌ చేశాడు. మద్యం మత్తులో సంగీత్‌ డీమార్ట్‌ సమీపంలోని ఓ వీధి స్తంభం ఎక్కి కిందకు దూకుతానని బెదిరించాడు. అతన్ని ఇలియాజ్‌గా స్థానికులు గుర్తించారు. కిందకు దిగాలని స్థానికులు, పోలీసులు అతనికి సర్దిచెప్పే యత్నం చేసినా వినిపించుకోలేదు. తనకు క్వార్టర్‌ మద్యం ఇస్తేనే స్తంభం దిగుతానని, లేదంటే పైనుంచి దూకుతానంటూ బేరానికి వచ్చాడు. చివరికి అతని ‘డిమాండ్‌’ మేరకు మద్యం సీసా తీసుకొచ్చి చూపించడంతో పోల్‌ దిగేందుకు అంగీకరించాడు. స్ట్రీట్‌ లైట్స్‌ బిగించేందుకు ఉపయోగించే క్రేన్‌ సాయంతో జీహెచ్‌ఎంసీ సిబ్బంది అతన్ని కిందకు దించారు. 

Related Videos By Category

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement