ప్రజలతో మమేకమై సమస్యలు తెలుసుకుని.. వారిలో భరోసా నింపేందుకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర శ్రీకాకుళం జిల్లాలో దిగ్విజయంగా కొనసాగుతోంది. జననేత 336వ రోజు పాదయాత్రను బుధవారం ఉదయం పలాస నియోజకవర్గం, వజ్రకొత్తూరు మండలం నారాయణ పురం శివారు నుంచి ప్రారంభించారు. అక్కడి నుంచి హరిపురం, అంబుగాం మీదుగా ఇచ్ఛాపురం నియోజకవర్గం సోంపేట మండలం రాణిగాం, మామిడిపల్లి, పాత్రపురం క్రాస్, తరకసాసనం క్రాస్ వరకు వైఎస్ జగన్ పాదయాత్ర కొనసాగిస్తారు.