288వ రోజు ప్రజాసంకల్పయాత్ర ప్రారంభం | Day 288 of Praja Sankalpa Yatra begins | Sakshi
Sakshi News home page

288వ రోజు ప్రజాసంకల్పయాత్ర ప్రారంభం

Oct 17 2018 10:11 AM | Updated on Mar 21 2024 6:45 PM

రాష్ట్రంలో అవినీతి, అరాచక పాలనకు వ్యతిరేకంగా ప్రజల పక్షాన నిలుస్తూ ప్రతిపక్ష నేత, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌. జగన్‌ మోహన్‌ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర విజయనగరం జిల్లాలో అనంతవాహినిలా సాగుతోంది. బుధవారం ఉదయం జననేత 288వ రోజు పాదయాత్రను బొబ్బిలి నియోజకవర్గం బాడంగి మండలం పెద్ద భీమవరం నుంచి పాదయాత్ర ప్రారంభించారు. అక్కడి నుంచి జె.రంగరాయపురం, రంగరాయపురం, అప్పయ్య పేట, బొబ్బిలి వరకు పాదయాత్ర కొనసాగనుంది. బొబ్బిలిలో సాయంత్రం జరిగే బహిరంగ సభలో జననేత వైఎస్‌ జగన్‌ పాల్గొని ప్రసంగిస్తారు. 

Related Videos By Category

Advertisement
 
Advertisement

పోల్

Advertisement