రిక్షావాలాపై దాడి చేసిన ఆవు

కృష్ణా జిల్లా మచిలీపట్నంలో ఇటీవల జరిగిన సంఘటన జంతువుల్లో పేగుబంధం ఎంత బలమైందో చాటిచెబుతోంది. లక్ష్మీటాకీస్‌ సెంటర్‌లో గత నెల 29న గుర్తుతెలియని వాహనం ఢీకొని లేగ దూడ చనిపోయింది. తల్లి ఆవు రోజంతా బిడ్డ వద్దే పడుకుంది. చనిపోయిన ఆ దూడను మున్సిపల్‌ సిబ్బంది ఆదేశాలతో ఓ రిక్షా కార్మికుడు తీసుకెళ్లి ఖననం చేశాడు. అయితే ఇప్పుడు ఆవు ఆ రిక్షా కార్మికుడిపై పగబట్టింది. బిడ్డను తనకు కాకుండా తీసుకెళ్లిపోయాడని అనుకుందో ఏమో ఆ కార్మికుడు ఎక్కడ కనిపించినా కొమ్ములతో పొడిచేస్తోంది. గురువారం రాత్రి బస్టాండ్‌ సెంటర్‌లో కన్పించిన ఆ రిక్షావాలాపై దాడి చేసి కిందపడేసింది. స్థానికులు వచ్చి రక్షించడంతో ప్రాణాలు దక్కించుకున్నాడు. ఆ ఆవు బారి నుంచి ఎలా బయటపడాలా? అని రిక్షా కార్మికుడు తలపట్టుకుంటున్నారు.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వీడియోలు



 

Read also in:
Back to Top