గవర్నర్‌తో సీఎం జగన్‌ దంపతులు భేటీ | Sakshi
Sakshi News home page

గవర్నర్‌తో సీఎం జగన్‌ దంపతులు భేటీ

Published Mon, Nov 18 2019 6:04 PM

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి, ఆయన సతీమణి భారతీరెడ్డి సోమవారం గవర్నర్‌ విశ్వభూషణ్‌ హరిచందన్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఇవాళ మధ్యాహ్నం మర్యాద పూర్వకంగా జరిగిన ఈ సమావేశంలో విభిన్న అంశాలు చర్చకు వచ్చాయి. తాజా రాజకీయ పరిస్ధితులను గవర్నర్ బిశ్వ భూషణ్ హరిచందన్ కు వివరించిన సిఎం, అతి త్వరలో అసెంబ్లీ సమావేశాలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం నవరత్నాల పేరిట ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలను గురించి ముఖ్యమంత్రి వివరించారు.

Advertisement
Advertisement