Sakshi News home page

ఇస్రో టీమ్‌ కృషి వల్లే ఇది సాధ్యమైంది : శివన్‌

Published Mon, Jul 22 2019 4:18 PM

 అంతరిక్ష చరిత్రలోనే భారత్‌ సరికొత్త అధ్యాయాన్ని లిఖించిందని ఇస్రో చైర్మన్‌ కే.శివన్‌ సంతోషం వ్యక్తం చేశారు. చంద్రయాన్‌-2 ప్రయోగానంతరం మాట్లాడుతూ.. చంద్రయాన్‌-2 ప్రయోగం విజయవంతమైందన్నారు. అత్యంత కీలకమైన క్రయోజనిక్‌ దశ విజయవంతంగా ముగిసిందని, నిర్దేశిత కక్ష్యలోకి చంద్రయాన్‌-2 ప్రవేశించిందని తెలిపారు. చంద్రుడిపై భారత్‌ చేసిన చారిత్రాత్మక ప్రయాణం ఇదని అభివర్ణించారు. వచ్చే 24 గంటలు చాలా కీలకమని చెప్పారు. 

Advertisement
Advertisement