నిజామాబాద్‌లో కాలి బూడిదైన సెల్‌ టవర్‌

ఓ భవనంపై ఏర్పాటు చేసిన సెల్‌ టవర్‌లో ప్రమాదవశాత్తూ మంటలు చెలరేగి దగ్ధమైన సంఘటన నిజామాబాద్‌లో శనివారం చోటుచేసుకుంది. గాజులుపేటకు చెందిన నరసింహారావు నివాసంపై సెల్‌ టవర్‌ ఏర్పాటు చేశారు. ఇవాళ ఉదయం నుంచి కరెంట్‌ లేకపోవడంతో సిబ్బంది జనరేటర్‌ వేశారు. అయితే  షార్ట్ సర్యూట్‌తో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. సెల్‌టవర్‌ కోసం ఏర్పాటు చేసిన గదిలోని సామాగ్రి అగ్నికి ఆహుతి అయ్యింది. దీంతో చుట్టుపక్కల దట్టమైన పొగలు అలుముకున్నాయి.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వీడియోలు



 

Read also in:
Back to Top