ఈనాడులో తప్పుడు రాతలు అసత్య ప్రచారం

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన ‘అమ్మ ఒడి’  పథకంపై మున్సిపల్‌ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ప్రశంసలు కురిపించారు. అమ్మ ఒడి ఒక చరిత్ర అని, ఈ పథకం ద్వారా 42 లక్షల 12 వేల మంది తల్లులకు దాదాపుగా రూ.6318 కోట్లు ప్రభుత్వం ఖర్చు చేస్తోందని ఆయన అన్నారు. తాడేపల్లిలో పార్టీ కార్యాలయంలో మంత్రి బొత్స సత్యనారాయణ గురువారం మీడియా సమావేశంలో మాట్లాడారు. దేశంలో ఏ రాష్ట్రం ప్రారంభించని అమ్మ ఒడి పథకాన్ని సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రారంభించారని, గతంలో ఇటువంటి కార్యక్రమాన్ని ఏ ముఖ్యమంత్రి కూడా చేయలేదని, అమ్మ ఒడి పథకం ఇతర రాష్ట్రాలకు ఆదర్శమని చెప్పారు. 

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వీడియోలు



 

Read also in:
Back to Top