ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ దిశగా సీఎం అడుగులు

మహిళలు, పిల్లల్లో పౌష్టికాహార లోపాన్ని నివారించి రాష్ట్రాన్ని ఆరోగ్య ఆంధ్రప్రదేశ్‌గా మార్చాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. ఇందులో భాగంగా రక్తహీనత, పౌష్టికాహార లోపం అధికంగా ఉన్న గిరిజన, సబ్‌ప్లాన్‌ ప్రాంతాల్లోని గర్భిణులు, 6 ఏళ్లలోపు చిన్నారులకు పౌష్టికాహారాన్ని పెంచేలా చర్యలు తీసుకోవాలన్నారు. మహిళలు, పిల్లల్లో పౌష్టికాహార లోపాన్ని నివారించడం, మధ్యాహ్న భోజన పథకం అమలు తీరుపై బుధవారం సచివాలయంలో ఆయన ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు.
 

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వీడియోలు



 

Read also in:
Back to Top