ఐదేళ్ల పాలనలో వ్యవస్థలను నీరుగార్చి ఘనుడు చంద్రబాబు నాయుడని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అన్నా రాంబాబు విమర్శించారు. గత ప్రభుత్వంలో ప్రజలను అనేక మోసాలకు గురిచేసిన చంద్రబాబు శాసన సభలో అడుగుపెట్టడానికి అనర్హుడని మండిపడ్డారు. పార్టీ ఫిరాయింపులను తొలుత ప్రోత్సహించింది ఆయన కాదా అని సభలో ప్రశ్నించారు. అంతేకాకుండా ఫిరాయింపు ఎమ్మెల్యేకు ఏకంగా మంత్రి పదవులు కూడా ఇచ్చారని ధ్వజమెత్తారు. చంద్రబాబు పాలనలో అనేక మంది అధికారులపై దాడులు జరిగాయని ఆయన సభ దృష్టికి తీసుకువచ్చారు.
Jul 30 2019 3:50 PM | Updated on Mar 20 2024 5:21 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement