బాబు.. అశోక్‌ను ఎక్కడ దాచారు? | Ambati Rambabu Fires On Chandrababu Naidu | Sakshi
Sakshi News home page

బాబు.. అశోక్‌ను ఎక్కడ దాచారు?

Mar 7 2019 5:42 PM | Updated on Mar 22 2024 11:17 AM

తమ పార్టీ సానుభూతిపరుల ఓట్లను చంద్రబాబు నాయుడు అక్రమంగా తొలగిస్తున్నారని వైఎస్సార్‌సీపీ నేత అంబటి రాంబాంబు ఆరోపించారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. టీడీపీ సేవామిత్ర యాప్‌లోకి ఆధార్‌ డేటా ఎలా వచ్చిందో చంద్రబాబు చెప్పాలని డిమాండ్‌ చేశారు. ఈ కేసును ఇరు రాష్ట్రాల మధ్య సమస్యగా చిత్రీకరిస్తున్నారని మండిపడ్డారు. డేటా చోరీ కేసుపై చంద్రబాబు విచారణకు సిద్ధమని చెప్పగలరా అని సవాల్‌ చేశారు. ఐటీ గ్రిడ్స్‌ సంస్థ ఎండీ అశోక్‌ని ఎక్కడ దాచారో చెప్పాలని డిమాండ్‌ చేశారు. అశోక్‌ విచారణకు వస్తే వాస్తవాలు బయటకు వస్తాయన్నారు. 

Advertisement

Related Videos By Category

Related Videos By Tags

Advertisement
 
Advertisement
Advertisement