జాతీయ భద్రతా సలహాదారు (ఎన్ఎస్ఏ)గా అజిత్ దోవల్ నరేంద్ర మోదీ నేతృత్వంలోని నూతన ప్రభుత్వంలోనూ కొనసాగుతారు. జాతీయ భద్రతా సలహాదారుగా దోవల్కు క్యాబినెట్ హోదా కట్టబెట్టారు. మరో ఐదేళ్ల వరకూ దోవల్ను ఈ పదవిలో నియమించినట్టు సోమవారం ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి. గతంలో సహాయ మంత్రి హోదాలో ఎన్ఎస్ఏగా సేవలందించిన అజిత్ దోవల్కు ప్రస్తుతం క్యాబినెట్ హోదా కల్పించారు.