చెన్నైలో దారుణం: తెలుగు టెకీపై అత్యాచారం | Sakshi
Sakshi News home page

చెన్నైలో దారుణం: తెలుగు టెకీపై అత్యాచారం

Published Fri, Feb 16 2018 12:25 PM

ఉద్యోగ రీత్యా  తమిళనాడులో ఉంటున్న తెలుగు యువతిపై దారుణం జరిగింది. విజయవాడకు చెందిన లావణ్యారెడ్డి ఓ ఐటీ ప్రముఖ కంపెనీలో పనిచేస్తోంది. గత రాత్రి విధులు పూర్తి చేసుకొని తన రూమ్‌ కు వెళ్తుండగా గుర్తు తెలియని వ్యక్తులు ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డారు. ఆపై తలపై రాడ్డుతో కొట్టి దోపిడీకి పాల్పడ్డారు. తలపై తీవ్రగాయాలు అవడంతో తాంబరం ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం లావణ్య పరిస్థతి విషమంగా ఉంది. దీనిపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

తప్పక చదవండి

Advertisement