ఆకట్టుకుంటున్న ‘పతీ, పత్నీ ఔర్ వో’ ట్రైలర్
‘పతీ, పత్నీ ఔర్ వో’ ట్రైలర్ స్పైసీ డైలాగులు, క్రేజీ సీన్లతో నెటిజన్లను ఆకట్టుకుంటోంది. కార్తీక్ ఆర్యన్, భూమి పడ్నేకర్, అనన్య పాండే హీరోహీరోయిన్లుగా తెరకెక్కిన ఈ సినిమా ట్రైలర్ సోమవారం విడుదలైంది. 1978లో వచ్చిన సూపర్హిట్ సినిమా ‘పతీ, పత్నీ ఔర్ వో’ ను అదే పేరుతో దర్శకుడు ముదస్సర్ అజిజ్ తెరకెక్కించారు. అప్పటి సినిమాను, ఇప్పటి సినిమాను కూడా బీఆర్ చోప్రా ఫిలిమ్స్ నిర్మించడం గమనార్హం. కానీ, పాత సినిమా కథకు ఏమాత్రం సంబంధంలేకుండా సరికొత్త నేపథ్యంతో ఈ సినిమాను దర్శకుడు తెరపైకి తెచ్చారు.
మరిన్ని వీడియోలు
వార్తలు
సీఎం వైఎస్ జగన్
బిజినెస్
క్రీడలు
వైరల్ వీడియోలు