ఏబీఎన్‌ చానల్‌పై వైఎస్సార్‌ సీపీ నేతలు ఫిర్యాదు | Sakshi
Sakshi News home page

ఏబీఎన్‌ చానల్‌పై వైఎస్సార్‌ సీపీ నేతలు ఫిర్యాదు

Published Tue, Aug 22 2017 5:12 PM

గడువు ముగిసినా మంత్రులు, టీడీపీ నాయకులు నంద్యాలలోనే ఉన్నారని వైఎస్సార్‌ సీపీ నాయకులు మంగళవారం ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌ రెడ్డి, కె.శివకుమార్‌, చల్లా మధుసూదన్‌ రెడ్డి.. ఎన్నికల ప్రధానాధికారి భన్వర్‌లాల్‌ను కలిసి ఈ మేరకు విజ్ఞాపనపత్రం సమర్పించారు. ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించిన ఆంధ్రజ్యోతి-ఏబీఎన్‌ చానల్‌పైనా ఫిర్యాదు చేశారు. ఇవాళ, రేపు అధికార పార్టీ నేతలు నిర్వహించే విలేకరుల సమావేశాలపైనా కూడా దృష్టి సారించాలని కోరారు.

Advertisement
Advertisement