యూపీ రైలు ప్రమాదం ప్రయాణికులను ఓ కుదుపు కుదిపింది. ఆదమరిచి నిద్రిస్తున్న వారిని శాశ్వత నిద్రలోకి నెట్టేసింది. చిమ్మ చీకట్లో జరిగిన ప్రమాదం మృతుల కుటుంబాల్లో చీకటి నింపింది. అప్పటి వరకు పక్కనే నిద్రిస్తున్నవారి జాడ దొరకని పరిస్థితి. నుజ్జునుజ్జరుున బోగీల్లో గుర్తుపట్టలేని విధంగా మృతదేహాలు.. పెళ్లి కోసం ఒకరు.. పెళ్లి పనుల కోసం మరొకరు.. తమవారి కోసం రైలు, ఆసుపత్రుల వద్ద వెతుకులాట కంటతడి పెట్టిస్తుంటే.. చావును దగ్గర్నుంచి చూశామని ఒకరు.. ఇలాంటి ప్రమాదాన్ని ఎప్పుడూ చూడలేదని మరొకరు. ఇలా ఒక్కొక్కరిదీ ఒక్కో విషాదగాథ. గ్యాస్ కట్టర్లతో ఎన్డీఆర్ఎఫ్, ఆర్మీ, రైల్వే బలగాలు తీవ్రంగా ప్రయత్నించి క్షతగాత్రులను, మృతదేహాలను బయటకు తీయాల్సి వచ్చింది.
Nov 21 2016 6:08 AM | Updated on Mar 22 2024 11:30 AM
Advertisement
Advertisement
పోల్
Advertisement