రాష్ట్రం సమైక్యంగా ఉండాలనే కోరుకున్నా: బొత్స | | Sakshi
Sakshi News home page

Jul 9 2013 7:32 PM | Updated on Mar 22 2024 11:25 AM

పీసీసీ అధ్యక్షుడు మంగళవారం కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీనివాసుడిని దర్శించుకున్నారు. దర్శనం అనంతరం ఆయన విలేకర్లతో మాట్లాడుతూ రాష్ట్రం సమైక్యంగానే ఉండాలని స్వామివారిని కోరుకున్నట్లు తెలిపారు. హైకమాండ్ ఎలాంటి నిర్ణయం తీసుకున్నా తాను కట్టుబడి ఉంటానని బొత్స తెలిపారు. రాష్ట్ర విభజన జరిగేతే... బాధాకరమైనా తాను వ్యతిరేకించనని ఆయన అన్నారు. ఒకవేళ పదవుల కోసమే తెలంగాణ ఏర్పడితే పీసీసీ అధ్యక్ష పదవిని వదులుకుంటానని బొత్స వెల్లడించారు. రాష్ట్ర పరిస్థితులపై నివేదిక అందించేందుకు అధిష్టానం ఎప్పుడు పిలిచినా తాను సిద్ధంగా ఉన్నానన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement