రాష్ట్రాన్ని విభజిస్తే జల యుద్ధాలు వస్తాయని సీమాంధ్ర నాయకులు కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ దిగ్విజయ్ సింగ్కు స్పష్టం చేశారు. మిగిలిన రాష్ట్రాల పరిస్థితికి ఆంధ్ర ప్రదేశ్లోని పరిస్థితికి ఎంతో తేడా ఉందని వివరించారు. ఈ మేరకు రూపొందించిన సమగ్ర నివేదకను సీమాంధ్ర నాయకులు సోమవారం దిగ్విజయ్ సింగ్కు అందజేశారు. పెద్ద సంఖ్యలో వచ్చిన నాయకులు ఈరోజు మధ్యాహ్నం లేక్వ్యూ అతిథిగృహంలో దిగ్విజయ్ను కలిశారు. తెలంగాణకు సంబంధించిన అధిష్టానం చేస్తున్న కసరత్తు కీలక దశకు చేరిందని దిగ్విజయ్ సింగ్ ప్రకటించిన క్షణంలో సీమాంధ్ర నాయకులు ఆయనను కలవడం ప్రాధాన్యతను సంతరించుకుంది. దిగ్విజయ్ సింగ్ను కలిసిన వారిలో 12మంది మంత్రులు, అయిదుగురు ఎంపీలు, 42మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. మరోవైపు రాష్ట్ర విభజనకు సంబంధించి తమతో హైకమాండ్ ఎప్పుడూ చర్చించలేదని సీమాంధ్ర నాయకులు టీజీ వెంకటేష్, ఏరాసు ప్రతాపరెడ్డి స్పష్టం చేశారు. 2014 ఎన్నికల్లోనే తేల్చుకుందామని కేసీఆర్ అంటుంటే తెలంగాణ అంశాన్ని ఇప్పుడు కదపాల్సిన అవసరమేముందని ప్రశ్నించారు. రాష్ట్ర విభజనకు సంబంధించి అంతా పరిష్కారం కోసం ఎదురుచూస్తున్నారని మంత్రి ఏరాసు ప్రతాపరెడ్డి అభిప్రాయపడ్డారు.
Jul 1 2013 4:14 PM | Updated on Mar 22 2024 11:25 AM
Advertisement
Advertisement
పోల్
Advertisement