ఉప్పల్-యాదాద్రి ‘మెట్రో’కు స్థల పరిశీలన | Sakshi
Sakshi News home page

ఉప్పల్-యాదాద్రి ‘మెట్రో’కు స్థల పరిశీలన

Published Thu, Jan 7 2016 7:46 AM

యాదాద్రికి రోజురోజుకూ భక్తుల రద్దీ పెరుగుతున్న నేపథ్యంలో ఉప్పల్ నుంచి యాదాద్రికి 52 కిలోమీటర్ల మెట్రో రైలు మార్గం నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. బుధవారం ఈ మార్గంలో హైదరాబాద్ మెట్రో రైల్(హెచ్‌ఎంఆర్) మేనేజింగ్ డెరైక్టర్ ఎన్వీఎస్ రెడ్డితోపాటు భువనగిరి ఎంపీ బూర నర్సయ్యగౌడ్, ఇతర నిపుణుల బృందం పర్యటించింది. భువనగిరి, రాయగిరి ప్రాంతాల్లో మెట్రో స్టేషన్లు, ఇతర మౌలిక వసతుల కల్పనకు అందుబాటులో ఉన్న ప్రభుత్వ స్థలాలను ఈ బృందం పరిశీలించింది.