లారీని ఢీకొన్న ఆటో, ఇద్దరి మృతి | two killed in road accident, 11 injured | Sakshi
Sakshi News home page

Jul 1 2015 8:03 AM | Updated on Mar 22 2024 10:56 AM

ప్రకాశం జిల్లాలోని సింగరాయకొండ మండలం కలికివాయి సమీపంలో తెల్లవారుజామున రోడ్డుప్రమాదం జరిగింది. ఆగి ఉన్న లారీని ఆటో ఢీకొట్టడంతో ఇద్దరు మృతిచెందగా, 11మందికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఒంగోలు రిమ్స్కు తరలించినట్టు సమాచారం. వీరంతా ఉలవపాడు మండలం చాగిచర్లకు చెందినవారిగా పోలీసులు గుర్తించారు. మృతుల వివరాలు తెలియాల్సి ఉంది.

Related Videos By Category

Advertisement
 
Advertisement

పోల్

Advertisement