ముంపు వాసులకు తక్షణమే పరిహారం ఇవ్వాలి | The compensation should be given to the people immediately caved in | Sakshi
Sakshi News home page

Dec 29 2016 9:42 AM | Updated on Mar 21 2024 11:25 AM

గండికోట ప్రాజెక్టు ముంపు వాసులకు తక్షణమే పరిహారం అందించాలని వైఎస్‌ఆర్‌సీపీ నాయకులు, మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి డిమాండ్‌ చేశారు. బుధవారం ముంపు గ్రామమైన చౌటుపల్లె వాసులు చేపట్టిన ధర్నాకు సంఘీభావం తెలిపేందుకు వెళుతున్న వైఎస్‌ వివేకాను పోలీసులు దౌర్జన్యంగా కొండాపురం మండలం రేగటిపల్లె వద్ద పోలీసులు అడ్డుకొని సింహాద్రిపురం పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. అనంతరం పోలీస్‌స్టేషన్‌ గేటు బయట నేలపై కూర్చొని ధర్నాకు దిగారు. దాదాపు మూడు గంటలపాటు మండు టెండను సైతం లెక్కచేయకుండా పోలీస్‌స్టేషన్‌ వద్ద నీరు, అన్నం తీసుకోకుండా ధర్నాకు దిగారు.

Advertisement
 
Advertisement

పోల్

Advertisement