సిటీబ్యూరో నగరంలో యాచకుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. పలు సిగ్నళ్లు, బస్టాండ్లు, రైల్వేస్టేషన్లు, ప్రార్థనా స్థలాల వద్ద పెద్ద సంఖ్యలో యాచకులు సంచరిస్తున్నారు. వీరిలో నెలలు నిండని పసికందులను చంకలో ఎత్తుకున్న మహిళల నుంచి...ఐదారేళ్లలోపు బాలలు, వృద్ధుల వరకు ఉన్నారు. వివిధ సంస్థలు నిర్వహించిన సర్వేల మేరకు నగరంలో ఉన్న 20 వేల మంది యాచకులు రోజుకు రూ.75 లక్షల చొప్పున ఏటా దాదాపు రూ.270 కోట్లు సంపాదిస్తున్నారు. వ్యవస్థీకృతమైన ఈ యాచక వృత్తిని నిర్మూలించేందుకు గత జూన్లో జీహెచ్ఎంసీ శ్రీకారం చుట్టింది. ఈ మేరకు నగరాన్ని ‘బెగ్గర్ ఫ్రీ సిటీ’గా మార్చేందుకు అడుగులు వేస్తోంది.
Nov 22 2016 12:57 PM | Updated on Mar 20 2024 3:39 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement