16 నుంచి అసెంబ్లీ సమావేశాలు | Telangana-Legislative-Assembly-begins-from-16-December | Sakshi
Sakshi News home page

Dec 8 2016 7:18 AM | Updated on Mar 21 2024 6:42 PM

రాష్ట్ర శాసనసభ, శాసనమండలి శీతాకాల సమావేశాలను ఈనెల 16 నుంచి నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు అసెంబ్లీ సమావేశాలను ప్రకటించాల్సిందిగా గవర్నర్‌ను కోరుతూ నోట్ పంపాలని అసెంబ్లీ కార్యదర్శి రాజా సదారాంను ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు కోరారు. అసెంబ్లీ సమావేశాలకు సంబంధించి బుధవారం ప్రగతి భవన్‌లో సన్నాహక సమావేశం జరిగింది. డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి, మంత్రులు హరీశ్‌రావు, కేటీఆర్, పోచారం శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, అసెంబ్లీ కార్యదర్శి రాజా సదారాం, అసెంబ్లీ చీఫ్ విప్ కొప్పుల ఈశ్వర్, మండలి విప్ పల్లా రాజేశ్వర్‌రెడ్డి తదితరులు ఇందులో పాల్గొన్నారు.

Related Videos By Category

Advertisement
 
Advertisement

పోల్

Advertisement