‘తలాక్‌’ రాజ్యాంగ ధర్మాసనానికి.. | Sakshi
Sakshi News home page

‘తలాక్‌’ రాజ్యాంగ ధర్మాసనానికి..

Published Fri, Feb 17 2017 7:29 AM

ముస్లిం సంప్రదాయాలైన ట్రిపుల్‌ తలాక్, నిఖా హలాలా, బహుభార్యత్వంపై దాఖలైన పిటిషన్ల విచారణ బాధ్యత రాజ్యాంగ ధర్మాసనానికి సుప్రీం కోర్టు అప్పగించింది. దీని కోసం ఐదుగురితో కూడిన ధర్మాసనం ఏర్పాటు చేయనుంది. చీఫ్‌ జస్టిస్‌ జేఎస్‌ ఖేహర్, జస్టిస్‌ ఎన్ వీ రమణ, జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌లతో కూడిన ధర్మాసనం గురువారం ఈ నిర్ణయం తీసుకుంది. ఈ అంశాలు చాలా ముఖ్యమైనవని, ఇంకా సాగదీయకూడదని ధర్మాసనం పేర్కొంది. కేంద్ర ప్రభుత్వం లేవనెత్తిన అంశాలన్నీ రాజ్యాంగానికి సంబంధించినవని, అందువల్ల విస్తృత ధర్మాసనం అవసరం ఉందని కోర్టు పేర్కొంది.

Advertisement

తప్పక చదవండి

Advertisement