ఎస్సీ, ఎస్టీ, మైనారిటీల సంక్షేమానికి ఈ బడ్జెట్లోనూ కేంద్రం పెద్దపీట వేసింది. దళితుల సంక్షేమానికి 2016–17లో కేటాయించిన రూ.38,833 కోట్లను ఈసారి రూ.52,393కోట్లకు పెంచుతున్నట్లు ఆర్థిక మంత్రి జైట్లీ ప్రకటించారు. గతంతో పోలిస్తే ఇది 35 శాతం అదనం. తాజా బడ్జెట్లో గిరిజన సంక్షేమ శాఖకు గతేడాదితో పోలిస్తే అదనంగా రూ.5,329 కోట్లు (10 శాతం అదనం) కేటాయించారు. 2016–17 బడ్జెట్ లో ఈ శాఖకు రూ. 24,005కోట్లు కేటాయించగా.. ఈసారి దీన్ని రూ.31, 920 కోట్లకు పెంచారు. ఈ విభాగాల్లో సరైన ఫలితాలు వచ్చేందుకు నీతి ఆయోగ్ ద్వారా వ్యయ సమీక్ష జరపాలని కేంద్రం భావిస్తోంది.
Feb 2 2017 6:14 AM | Updated on Mar 21 2024 8:52 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement