వేధింపులతో సగం చచ్చిపోయా! | Rishiteshwari another dairy found | Sakshi
Sakshi News home page

Aug 14 2015 7:30 AM | Updated on Mar 22 2024 10:40 AM

రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించిన ఆర్కిటెక్చర్ విద్యార్థిని రిషితేశ్వరి కేసు కీలక మలుపు తిరిగింది. ఆత్మహత్యకు ముందు ఆమె రాసుకున్న మరో డైరీ బయటపడింది. ఇప్పటికే ఒక డైరీ వెలుగులోకి వచ్చిన సంగతి తెలిసిందే. వరంగల్‌లోని తమ ఇంట్లో రెండో డైరీని గుర్తించిన రిషితేశ్వరి తల్లిదండ్రులు మురళీకృష్ణ, దుర్గాబాయి గుంటూరులోని పోలీసు ఉన్నతాధికారులకు అందజేశారు. ఈ డైరీలోని 13 పేజీల్లో రిషితేశ్వరి తనను సీనియర్లు వేధించిన తీరును కళ్లకు కట్టినట్లు రాసుకుంది. గుంటూరులోని ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో చేరినప్పటి నుంచి అనుభవించిన నరకయాతన గురించి డైరీలో పేర్కొన్నట్లు చెబుతున్నారు. మొద టి డైరీలో తనను వేధింపులకు గురిచేసిన సీనియర్ల గురించి రాసినప్పటికీ ఆ పేర్లు కొట్టివేసి ఉన్నాయి. దాంతో అవి తమ పేర్లు కాదని రిమాండ్‌లో ఉన్న సీనియర్ విద్యార్థులు బుకాయిస్తున్నారు.

Advertisement
 
Advertisement

పోల్

Advertisement