జింగ్‌పింగ్‌తో మోదీ మంతనాలు..పాక్‌పై చర్చ! | PM Modi Meets Chinese President Xi Jinping, | Sakshi
Sakshi News home page

Oct 16 2016 6:12 AM | Updated on Mar 20 2024 1:57 PM

బ్రిక్స్‌ సదస్సు నేపథ్యంలో చైనా అధ్యక్షుడు గ్జి జింగ్‌పింగ్‌తో ప్రధానమంత్రి నరేంద్రమోదీ శనివారం భేటీ అయ్యారు. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌తో భేటీ అనంతరం జింగ్‌పింగ్‌ను మోదీ కలుసుకున్నారు. ఇటీవలికాలంలో వరుస ఉగ్రవాద దాడులపై భారత్‌ ఆందోళన వ్యక్తం చేస్తున్నా.. చైనా బహాటంగా పాకిస్థాన్‌కు మద్దతునిస్తోంది. అంతేకాకుండా పాకిస్థానీ ఉగ్రవాది మసూద్‌ అజార్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా గుర్తించాలన్న భారత తీర్మానానికి ఐరాసలో మోకాలడ్డింది.

Related Videos By Category

Advertisement
 
Advertisement

పోల్

Advertisement