కస్టడీకి కేంద్రమంత్రి.. బెయిల్ మంజూరు

కేంద్ర మైనారిటీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి ముఖ్తార్ అబ్బాస్ నఖ్వీని జ్యుడీషియల్ కస్టడీకి తరలించారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని రాంపూర్ ప్రాంతంలో ఆయనను అదుపులోకి తీసుకున్నారు.

2009లో ఎన్నికల నియమావళిని ఉల్లంఘించినట్లు నఖ్వీపై ఆరోపణలున్నాయి. ఆ నేపథ్యంలోనే ఆయనను అదుపులోకి తీసుకుని, జ్యుడీషియల్ కస్టడీకి తరలించారు. ఈ కేసులో రాంపూర్ కోర్టు నఖ్వీకి ఏడాది జైలుశిక్ష విధించింది. అయితే వెంటనే కేంద్ర మంత్రి నఖ్వీకి బెయిల్ కూడా మంజూరుచేసింది.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వీడియోలు



 

Read also in:
Back to Top