కోదండరాం పార్టీ పెట్టాలి | Kodandaram should put a political party | Sakshi
Sakshi News home page

Jan 18 2017 6:33 AM | Updated on Mar 21 2024 8:31 PM

తెలంగాణ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు అస్తవ్యస్తంగా ఉందని, దీన్ని సరి చేసేందుకు ప్రత్యామ్నాయ రాజకీయ వేదిక అవసరం ఉందని జైకిసాన్‌ ఆందోళన్‌ కన్వీనర్, ప్రొఫెసర్‌ యోగేంద్ర యాదవ్‌ అన్నా రు. టీజేఏసీ చైర్మన్‌ కోదండరాం నేతృత్వంలో పార్టీ రావాలని, ఇది ప్రజల అభివృద్ధి కోసం పాటుపడుతుందని తాము భావిస్తున్నామని పేర్కొన్నారు. అవినీతి, అసమర్థ ప్రభుత్వా లను ఎదుర్కొని ప్రజల అభివృద్ధే లక్ష్యంగా ఉండే వేదిక ఏర్పడాలని ఆకాంక్షించారు. స్వచ్ఛంద సంస్థలు, సంఘాలు, చైతన్యమైన మీడియా.. ఇలా నీతితో కూడిన సమాజాన్ని ఏర్పాటు చేసేందుకు విలువలతో కూడిన రాజకీయ ప్రత్యామ్నాయం కావాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. మంగళవారమిక్కడ అడ్వొకేట్‌ జేఏసీ ఏర్పాటు చేసిన ‘ప్రత్యామ్నాయ రాజకీయం’ అంశంపై ఆయన మాట్లా డారు.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement