కొనసాగుతున్న ఏసీబీ దర్యాప్తు | investigation going on SSC Director | Sakshi
Sakshi News home page

Jul 29 2016 7:45 PM | Updated on Mar 20 2024 3:30 PM

లంచం తీసుకుంటూ గురువారం పట్టుబడిన ఎస్సెస్సీ బోర్డు డెరైక్టర్ ప్రసన్నకుమార్‌ను ఏసీబీ అధికారులు శుక్రవారం కూడా విచారించారు. లంచం కేసులో మధ్యవర్తిగా వ్యవహరించిన రఫీతోపాటు ఆయన బస చేసిన లక్డీకాపూల్‌లోని వెంకటేశ్వర లాడ్జిపైనా దాడులు చేశారు. ఆయన ఉంటున్న 201 నంబర్ రూంలో సోదాలు చేపట్టారు. ఈ సందర్భంగా అక్కడ ఉన్న రూ.36 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు. రఫీతోపాటు ప్రసన్నకుమార్‌పై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఏసీబీ డీఎస్పీ రమాదేవి తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement