'బుడుగజంగాలకు అన్యాయం చేస్తున్నారు' | injustic to Budugajangalu, says vishweshwar reddy | Sakshi
Sakshi News home page

'బుడుగజంగాలకు అన్యాయం చేస్తున్నారు'

Aug 13 2017 4:42 PM | Updated on Mar 22 2024 10:55 AM

అట్టడుగున ఉన్న బుడుగజంగం సామాజికవర్గానికి చంద్రబాబు ప్రభుత్వం అన్యాయం చేస్తోందని వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే విశ్వేశ్వర్‌రెడ్డి అన్నారు. జీవో 114ను తీసుకురావడం ద్వారా బుడుగజంగాలకు ప్రభుత్వం అన్యాయం చేసిందని తెలిపారు. ఒక్క కర్నూలు జిల్లాలోనే 70వేల మంది బుడుగజంగాలు ఉండగా, నంద్యాలలో నాలుగువేల మంది ఉన్నారని, వారందరికీ అన్యాయం చేసేలా చంద్రబాబు ప్రభుత్వం వ్యవహరిస్తోందని విశ్వేశ్వర్‌రెడ్డి విమర్శించారు. దివంగత నేత వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జీవో 84ను తీసుకొచ్చి బుడుగజంగాలను ఆదుకున్నారని గుర్తుచేశారు.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement