భార్యపై కత్తితో దాడికి పాల్పడిన సంఘటన ఆదివారం జరిగింది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. నాదెండ్ల మండలం గణపవరం గ్రామంలోని అంబేడ్కర్ కాలనీకి చెందిన పడాల సావిత్రి తన అక్క కూతురిని పట్టణంలోని కళామందిర్ సెంటర్లో ఉన్న ఓ ప్రైవేటు ఆసుపత్రికి తీసుకువచ్చింది. వైద్యుడు లేకపోవడంతో ఇద్దరూ ఓపీ వద్ద వేచి ఉన్నారు. సుమారు మధ్నాహ్యం మూడు గంటల సమయంలో సావిత్రి భర్త పడాల అక్కిరాజు ఆసుపత్రికి వచ్చి ఆమెతో వాగ్వాదానికి దిగాడు. హటాత్తుగా బొడ్డులో నుంచి కత్తి తీసి దాడి చేసేందుకు ప్రయత్నించాడు. ఇది గమనించిన సావిత్రి డాక్టర్ గదిలోకి వెళ్లి తలుపు గడియ వేసుకొనే ప్రయత్నం చేసింది. తలుపు గడియ పడకపోవడంతో లోనికి తోసుకువెళ్లిన అక్కిరాజు తన వద్ద ఉన్న కత్తితో విచక్షణ రహితంగా దాడి చేసి పరారయ్యాడు.
Oct 25 2016 8:19 AM | Updated on Mar 20 2024 1:43 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement