వైఎస్ జగన్ బెయిల్ షరతులు సడలించిన కోర్టు | court relaxes bail conditions of ys jagan | Sakshi
Sakshi News home page

Oct 30 2013 3:42 PM | Updated on Mar 21 2024 7:47 PM

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఎంపి జగన్మోహన రెడ్డి బెయిలు షరతులను నాంపల్లిలోని సిబిఐ ప్రత్యేక కోర్టు సడలించింది. రాష్ట్రమంతటా పర్యటించేందుకు కోర్టు ఆయనకు అనుమతి ఇచ్చింది. అంతేకాకుండా ఆయన ఢిల్లీ వెళ్లేందుకు కూడా కోర్టు అవకాశం కల్పించింది. భారీ వర్షాలు, వరదలకు రాష్ట్రమంతటా తీవ్ర నష్టం జరిగింది. వరద ముంపు ప్రాంతాలలో పర్యటించి బాధితులను పరామర్శించేందుకు అనుమతి ఇవ్వాలని జగన్ తరపున దాఖలు చేసిన పిటిషన్ను పరిశీలించిన కోర్టు ఆయనకు అనుమతి ఇచ్చింది. దీంతో జగన్ రాష్ట్రమంతటా పర్యటించి బాధితులను పరామర్శించే అవకాశం ఉంది.

Advertisement
 
Advertisement
Advertisement