ఇప్పుడైతే రాజ్యసభలో ప్రైవేటు బిల్లు ఓటింగ్ను అడ్డుకోగలిగారు కానీ...రాబోయే సమావేశాల్లో ఎలా అడ్డుకుంటారో చూస్తామని కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు కేవీవీ రామచంద్రరావు అన్నారు. ఆంధ్ర ప్రజలపై సానుభూతి ఉన్న మిత్రపక్షాల మద్దతుతో ఎలాగైనా బిల్లును ఆమోదింపజేసుకుంటామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. శుక్రవారం రాజ్యసభ వాయిదా అనంతరం కేవీపీ విలేకర్లతో మాట్లాడారు. తామేమీ గొంతెమ్మ కోరికలు కోరటం లేదని, ప్రధాని ఇచ్చిన హామీనే అమలు చేయాలని అడుగుతున్నామన్నారు. ప్రైవేటు బిల్లుకు అడ్డుపడి ఆంధ్రప్రదేశ్కు కేంద్రం తీవ్ర అన్యాయం చేసిందని కేవీపీ వ్యాఖ్యానించారు.
Jul 22 2016 8:01 PM | Updated on Mar 22 2024 10:49 AM
Advertisement
Advertisement
పోల్
Advertisement