చిత్తూరు కలెక్టరేట్ వద్ద 144 సెక్షన్ విధింపు | Chittoor-collector-invokes-section | Sakshi
Sakshi News home page

Apr 10 2015 9:34 AM | Updated on Mar 21 2024 5:25 PM

చిత్తూరు కలెక్టరేట్ వద్ద 144 సెక్షన్ విధించినట్లు డీఎస్పీ లక్ష్మీనాయుడు తెలిపారు. శేషాచలం ఎన్కౌంటర్పై నిరసన తెలిపేందుకు తమిళనాడుకు చెందిన రాజకీయ పార్టీల నేతలు, వేలాదిమంది కార్యకర్తలు వస్తున్నట్లు సమాచారం అందటంతో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు డీఎస్పీ శుక్రవారమిక్కడ వెల్లడించారు. ఇందుకోసం జిల్లాకు వచ్చే అన్ని సరిహద్దుల్లో బందోబస్తు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. మంగళవారం తిరుపతి శేషాచలం అడవుల్లో 20మంది ఎర్రచందనం కూలీలు ఎన్ కౌంటర్ అయిన విషయం తెలిసిందే.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement