గవర్నర్ సమక్షంలో మంత్రుల భేటీ | Sakshi
Sakshi News home page

గవర్నర్ సమక్షంలో మంత్రుల భేటీ

Published Thu, Feb 9 2017 6:46 PM

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లకు సంబంధించి సమస్యలను పరిష్కరించుకునేందుకు గురువారం రెండు రాష్ట్రాల మంత్రుల కమిటీ సభ్యులు రాజ్‌భవన్ లో భేటీ అయ్యారు. గవర్నర్‌ నరసింహన్ సమక్షంలో ఆంధ్రప్రదేశ్‌ పునర్‌వ్యవస్థీకరణ చట్టానికి లోబడి ఉద్యోగుల విభజన, భవనాల అప్పగింత, తొమ్మిది, పదో షెడ్యూల్‌లోని సంస్థల విభజన... తదితర అంశాలపై చర్చించారు. ఏపీ మంత్రి యనమల రామకృష్ణుడు, తెలంగాణ మంత్రి హరీశ్ రావు తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.

Advertisement
Advertisement