కేంద్ర పథకాల కుదింపు | Amid Lalit Modi Controversy, Vasundhara Raje Reaches Delhi for NITI Aayog Meeting, Likely to Meet Top BJP Leaders | Sakshi
Sakshi News home page

Jun 28 2015 6:51 AM | Updated on Mar 22 2024 10:59 AM

కేంద్ర ప్రాయోజిత పథకాల సంఖ్య భారీగా తగ్గనుంది. ప్రస్తుతం 72 ఉన్న ఈ పథకాలను 30కి కుదించనున్నారు. ఈ మేరకు నీతి ఆయోగ్ ముఖ్యమంత్రుల సబ్ కమిటీ సమావేశంలో ఏకాభిప్రాయం వ్యక్తమైంది. కేంద్రం ఇచ్చే నిధుల్లో ప్రస్తుతం 10 శాతం నిధులను (ఫ్లెక్సీ ఫండ్) రాష్ట్రాలు తమ అభీష్టం మేరకు ఖర్చు చేసుకునే వెసులుబాటు ఉంది. ఇకపై ఈ వాటాను 25 శాతానికి పెంచాలని సబ్ కమిటీ కేంద్రానికి సిఫారసు చేసింది. శనివారమిక్కడ నీతి ఆయోగ్‌లో సబ్ కమిటీ భేటీ అయింది. అనంతరం కమిటీ కన్వీనర్, మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ విలేకరులతో మాట్లాడారు. ‘మా తుది సిఫారసులు జూలై 5నాటికి ఖరారవుతాయి. మరిన్ని సలహాలు స్వీకరించాల్సి ఉంది. ప్రధాని మోదీకి నివేదిక సమర్పించేందుకు ముందు కమిటీలోని సభ్యులతోపాటు సీఎంలందరి అభిప్రాయాలు తెలుసుకుంటాం. ఆ తర్వాతే నివేదిక ఇస్తాం’ అని ఆయన చెప్పారు.

Related Videos By Category

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement