ఖుషీ, ఒక్కడు, అనసూయ లాంటి సినిమాలతో తెలుగులో స్టార్ హీరోయిన్గా గుర్తింపు పొందిన భూమిక పెళ్లి తర్వాత సినిమాలకు దూరమైన విషయం తెలిసిందే. అయితే తాజాగా ఆమె హిందీ సినిమాలో ఓ ప్రత్యేక పాత్రలో మెరవనుంది. రెండు రోజుల క్రితం రిలీజై ఇప్పటికే 40లక్షల మంది వీక్షకులను మెప్పించిన 'ఎమ్మెస్ ధోనీ' చిత్ర ట్రైలర్లో తళుక్కుమంది భూమిక.